వీళ్లే నాకు స్ఫూర్తి, ఆశ, బలం... ఆసక్తికర వీడియో పంచుకున్న రేవంత్ రెడ్డి

  • ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ సభ
  • దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా పేరుతో సభ
  • పోలీసులు ప్రజలను అడ్డుకున్నారన్న రేవంత్
  • ప్రజలు 3 కిమీ నడిచి వచ్చారని వెల్లడి
దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా పేరుతో కాంగ్రెస్ పార్టీ ఇంద్రవెల్లిలో భారీ సభ ఏర్పాటు చేయడం తెలిసిందే. అయితే ఈ సభకు వచ్చే జనాన్ని పోలీసులు అడ్డుకున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన ఓ ఆసక్తికర వీడియో పంచుకున్నారు. ఇంద్రవెల్లి సభావేదికకు మూడు కిలోమీటర్ల ఆవలే ప్రజల వాహనాలను పోలీసులు నిలిపివేశారని, అయినప్పటికీ జనాలు కాలినడకన తమ సభకు వచ్చారని రేవంత్ వివరించారు. ఆ వీడియోలో పెద్ద సంఖ్యలో ప్రజలు నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు ఉన్నాయి. దీనిపై రేవంత్ స్పందిస్తూ, వాళ్లే తన స్ఫూర్తి, వాళ్లే తన ఆశ, వాళ్లే తన బలం అని స్పష్టం చేశారు.

Revanth Reddy
Indravelli
Dalita Girijana Atmagourava Dandora
Congress
Telangana

More Telugu News